పెట్రోల్ బాటిల్‌తో మరో రైతు హల్‌చల్

పెట్రోల్ బాటిల్‌తో మరో రైతు హల్‌చల్

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయంలో లంబడిపల్లికి చెందిన రైతు పెట్రోల్ బాటిల్‌తో హల్‌చల్ చేశాడు. తన భూసమస్య పరిష్కరించడం లేదంటూ కనకయ్య అనే రైతు తహశీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్లపై పెట్రోల్ చల్లాడు. ఆ క్రమంలో పెట్రోల్ కార్యలయ సిబ్బంది, అధికారులపై కూడా పడింది. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. అధికారులు తన సమస్యను పరిష్కరించకపోవడంతోనే కనకయ్య ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. రైతు కనకయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదం కారణంగానే భూమి పట్టా చేయలేదని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారు.