సికింద్రాబాద్ కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బిక్కి మచ్చేందర్ రావు (95) కన్నుమూశారు. అల్వాల్ లోని తన స్వగృహంలో వృద్ధాప్యంతో తుది శ్వాస విడిచారు.. సికింద్రాబాద్ బోయగూడాకు చెందిన బింగి మచ్చేందర్ రావు సతీమణి పద్మావతి గతంలో మరణించారు. మచ్చేందర్ రావుకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడు రమేష్ కుమార్ గతంలో మరణించారు.
మచ్చేందర్ రావ్ 1969-73 వరకు హైదరాబాద్ జువైనల్ మేజిస్ట్రేట్ కోర్టులో జడ్జిగా పని చేశారు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జనతా పార్టీ తరపున 1978-83 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పోరాడి సాధించిన ఘనత మచ్చేందర్ రావుకి ఉంది. ఆయన కొంతకాలంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అల్వాల్ లోని స్వగృహంలో జై జై నగర్ లో తుదిశ్వాస విడిచారు.