న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా బీజేపీలో చేరనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో ఢంకా మోగనున్న నేపథ్యంలో మోంగియా బీజేపీ తీర్థం పుచ్చుకోనుండటం గమనార్హం. ఇవ్వాళ దేశ రాజధానిలో ప్రముఖ నేతల ఆధ్వర్యంలో మోంగియా బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Former cricketer Dinesh Mongia to join Bharatiya Janata Party in Delhi today. pic.twitter.com/ERkZH5uF0j
— ANI (@ANI) December 28, 2021
కాగా, టీమిండియా తరఫున 57 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన మోంగియా.. 1,230 రన్స్ చేశాడు. వీటిలో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి ఖాతాలో 14 వికెట్లు కూడా ఉండటం విశేషం.
మరిన్ని వార్తల కోసం: