బీజేపీ గూటికి మాజీ క్రికెటర్

బీజేపీ గూటికి మాజీ క్రికెటర్

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ దినేశ్ మోంగియా బీజేపీలో చేరనున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలో ఢంకా మోగనున్న నేపథ్యంలో మోంగియా బీజేపీ తీర్థం పుచ్చుకోనుండటం గమనార్హం. ఇవ్వాళ దేశ రాజధానిలో ప్రముఖ నేతల ఆధ్వర్యంలో మోంగియా బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కాగా, టీమిండియా తరఫున 57 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన మోంగియా.. 1,230 రన్స్ చేశాడు. వీటిలో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి ఖాతాలో 14 వికెట్లు కూడా ఉండటం విశేషం. 

 

 

 

 

 

మరిన్ని వార్తల కోసం: 

త్వరలో అందుబాటులోకి రెండు కొత్త టీకాలు

ఓల్డ్‌ సిటీలో కొత్త ఫ్లైఓవర్కు అబ్దుల్ కలాం పేరు

పోలీసులపై సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు