కాలమే సమాధానం చెప్తుంది.. కేటీఆర్ వేదాంతం

కాలమే సమాధానం చెప్తుంది.. కేటీఆర్ వేదాంతం

పార్టీ మారే విషయంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌‌రెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌‌‌‌రెడ్డి తనను పిచ్చోన్ని చేశారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​అన్నారు. ఇన్నాళ్లు తమ వెంట ఉన్న నాయకులు.. కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు.

కాలమే సమాధానం చెబుతుంది..

కేకే, కడియం శ్రీహరి పార్టీ మారడంపై కేటీఆర్ అసహనం వ్యక్తంచేశారు. ‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేకే, కడియం శ్రీహరి వంటి పెద్ద పెద్ద నాయకులు జారుకుంటున్నరు. పదేండ్లు అన్నీ అనుభవించి పోతూ పోతూ రెండు  మూడు రాళ్లేసి పోతున్నరు. కానీ, వాళ్లు పెద్దవాళ్లు.. వాళ్లను నేనేమీ అనదల్చుకోలేదు. వాళ్ల విజ్ఞతకే వదిలేద్దాం. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది’ అని  వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌‌ పాలన చూసి ఆ పార్టీకి ఓటేసిన ప్రజలు తేలుకుట్టిన దొంగల్లాగా సైలెంట్‌‌గా ఉంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వాళ్లు ఇప్పుడు బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌‌కు 40 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని అన్నారు.  కాగా, చేవెళ్లలో తప్పకుండా గెలుస్తాం అని ఆ నియోజకవర్గ బీఆర్​ఎస్​ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే ప్రకాశ్​గౌడ్​ దూరం

కేటీఆర్ నిర్వహించిన చేవెళ్ల సన్నాహక సమావేశానికి ఆ పార్టీ  నేత, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌‌గౌడ్ హాజరు కాలేదు. ఆయన కాంగ్రెస్‌‌లోకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల సీఎం రేవంత్‌‌రెడ్డిని కూడా కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన మీటింగ్‌‌కు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ప్రకాశ్‌‌గౌడ్ గురువారం కేసీఆర్‌‌‌‌ను కలిశారని, తన మనవరాలి పెండ్లికి రమ్మని ఆహ్వానించారని మీటింగ్‌‌లో కేటీఆర్  చెప్పారు