బీఆర్ఎస్ వల్లే ఎంపీ రంజిత్ రెడ్డి ప్రపంచానికి తెలుసు: కేటీఆర్

బీఆర్ఎస్ వల్లే ఎంపీ రంజిత్ రెడ్డి ప్రపంచానికి తెలుసు: కేటీఆర్

ఎంపీ రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ వల్లే పేరొచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచాకే   రంజిత్ రెడ్డి ఎవరో  ప్రపంచానికి తెలిసిందన్నారు. 2019 లో రాజకీయాలకు కొత్త అయినా పార్టీలో ఉన్న, ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి ఆయనను గెలిపించారని చెప్పారు. కేవలం అధికారం, ఆస్ధుల  కోసమే రంజిత్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు.

 ఒక పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలబోరన్నారు కేటీఆర్.  చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదన్నారు. సొంతంగా అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో గెలవడం అసాధ్యమన్నారు.  చేవెళ్ల నియోజకవర్గంలో  ఏప్రిల్ 13వ  తేదీన కేసీఆర్  బహిరంగ సభ ఉంటుందన్నారు కేటీఆర్.