నేను ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసు : జగ్గారెడ్డి

నేను ఓడిపోతానని ఆరు నెలల ముందే తెలుసు : జగ్గారెడ్డి
  •     నా ఓటమిని ఆరు నెలల ముందే గుర్తించా: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు :  సంగారెడ్డిలో తన ఓటమిని ఆరు నెలల ముందే గుర్తించానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తనను సంగారెడ్డి ప్రజలు రిజెక్ట్ చేయలేదని, తానే సంగారెడ్డి ప్రజలను రిజెక్ట్ చేశానన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో చిట్‌‌‌‌‌‌‌‌ చాట్ చేశారు. ఓటమి తనకేమీ నష్టం కాదని, ప్రజలకే నష్టమని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంతో తన నియోజకవర్గంలో పని చేయించానన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాకే సంగారెడ్డిలో అభివృద్ధి జరిగిందన్నారు. ఓట్ల కోసం సంగారెడ్డిలో బలహీనుడిలా కాదల్చుకోలేదని

ఇకపై సంగారెడ్డిలో పోటీ చేయనన్నారు. తనను ఓడించేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు రూ.60 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. రేవంత్ సీఎం అవుతారని తనకు ఆనాడే తెలుసన్నారు. సంగారెడ్డిలో ఓడిపోవాలని తానే అనుకున్నానన్నారు. తాను గెలుస్తానని సీఎం రేవంత్ చెప్పినా.. ఓడిపోతున్నానని ఆయనకు ముందే చెప్పానన్నారు.