కర్నాటక ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్

కర్నాటక ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ వివేక్

హైదరాబాద్, వెలుగు: కర్నాటకలో బీజేపీ గెలుపు కోసం అందరూ కష్టపడి పని చేయాలని లీడర్లను పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే కర్నాటక డెవలప్ అవుతుందని సూచించారు. శుక్రవారం కొప్పల్ జిల్లా కుష్టగి నియోజకవర్గంలోని హులియప్పుర్ గ్రామంలో బూత్ లెవల్ లీడర్లు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. 
సీఎం బస్వరాజ్ బొమ్మై నేతృత్వంలోనే కర్నాటక ఎంతో అభివృద్ధి చెందిందని వివరించారు. తర్వాత, నిరలూటీ గ్రామంలోనూ బూత్ లెవల్ పార్టీ లీడర్లతో సమావేశమై.. దొడ్డన గౌడ పాటిల్​ను గెలిపించాలని కోరారు.