కాకాకు మాజీ ఎంపీ వివేక్ నివాళులు

కాకాకు మాజీ ఎంపీ వివేక్ నివాళులు

కాకా వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ట్యాంక్ బండ్ దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘కాకా ఉర్దూ మీడియంలో పదో తరగతి పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆయనకు ఒకటే ధ్యాస ఉండేది. పేద పిల్లల కోసం కాలేజీలు ఏర్పాటుచేయాలనుకొని.. అంబేద్కర్ కాలేజీలను స్థాపించారు. ఆయన ఆశయాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. మాకు మంచి దారి చూపించినందుకు ఆయనకు మేమంతా ఎప్పుడూ కృతజతలు చెబుతాం. బీద ప్రజలకు సాయం చేయాలన్న ఆయన కలను ఎప్పుడు అనుసరిస్తాం’ అని వివేక్ అన్నారు.

కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని మాజీ మంత్రి వినోద్ అన్నారు. ‘నాన్న చనిపోయి అప్పడే 7 ఏండ్లు పూర్తయింది. కాకా లేని లోటు మా కుటుంబానికి ఎప్పటికీ తీరనిది. మా నాన్న ఇచ్చిన స్పూర్తిని ముందుకు తీసుకెళ్తున్నాం. మేం ఎంతచేసినా ఆయన చేసినదాంట్లో చాలా తక్కువే’ అని వినోద్ అన్నారు.