
నెక్కొండ, వెలుగు: నెక్కొండ ఎస్సై మహేందర్కాంగ్రెస్ ఏజెంట్లా పని చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. నెక్కొండ పట్టణంలోని ఓ గార్డెన్లో గురువారం బీఆర్ఎస్కార్తకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్నాయకులు తమ నాయకులపై రౌడీషీట్, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
నెక్కొండ పోలీస్స్టేషన్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. రాసిపెట్టుకో.. రాబోయేది బీఆర్ఎస్గవర్నమెంట్.. నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని ఎస్సైకి వార్నింగ్ఇచ్చారు. రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చారని, రుణమాఫీ పూర్తిగా జరగలేదని పేర్కొన్నారు. ప్రతీ మహిళకు, వృద్ధులకు, రైతులకు బాకీపడ్డ డబ్బులు చెల్లించాకే కాంగ్రెస్ ఓట్లు అడగాలన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని సూచించారు. మండల ప్రెసిడెంట్ సూరయ్య, మాజీ ఎంపీపీ రమేశ్, పీఏసీఎస్చైర్మన్ రాము తదితరులున్నారు.