రాసిపెట్టుకో.. ఎక్కడున్నా నిన్ను వదిలిపెట్ట..నెక్కొండ ఎస్సైకి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే వార్నింగ్

రాసిపెట్టుకో.. ఎక్కడున్నా నిన్ను వదిలిపెట్ట..నెక్కొండ ఎస్సైకి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే వార్నింగ్

నెక్కొండ, వెలుగు: నెక్కొండ ఎస్సై మహేందర్​కాంగ్రెస్ ఏజెంట్​లా పని చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి ఆరోపించారు. నెక్కొండ పట్టణంలోని ఓ గార్డెన్​లో గురువారం బీఆర్ఎస్​కార్తకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్​నాయకులు తమ నాయకులపై రౌడీషీట్,​ అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.

నెక్కొండ పోలీస్​స్టేషన్ సెటిల్​మెంట్లకు అడ్డాగా మారిందని ధ్వజమెత్తారు. రాసిపెట్టుకో.. రాబోయేది బీఆర్ఎస్​గవర్నమెంట్.. నువ్వు ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదని ఎస్సైకి వార్నింగ్​ఇచ్చారు. రైతు భరోసాను ఎన్నికల భరోసాగా మార్చారని, రుణమాఫీ పూర్తిగా జరగలేదని పేర్కొన్నారు. ప్రతీ మహిళకు, వృద్ధులకు, రైతులకు బాకీపడ్డ డబ్బులు చెల్లించాకే కాంగ్రెస్ ఓట్లు అడగాలన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని సూచించారు. మండల ప్రెసిడెంట్ సూరయ్య, మాజీ ఎంపీపీ రమేశ్, పీఏసీఎస్​చైర్మన్​ రాము తదితరులున్నారు.