కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లి మాజీ సర్పంచ్అధికం సత్యాగౌడ్ఆదివారం ఓ వీడియో పెట్టి, లెటర్ రాసి అదృశ్యమయ్యారు. గ్రామంలో తాను చేపట్టిన సీసీ రోడ్డు కాంట్రాక్ట్ పనికి బిల్లు రాకుండా కొందరు అడ్డుతగులుతున్నారని, తన చావుకు వాళ్లే కారణమని అందులో పేర్కొన్నాడు. దీనిపై సత్యాగౌడ్ భార్య లింగామణి సోమవారం కామారెడ్డి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాల్వంచ మండలం సింగరాయిపల్లికి చెందిన మాజీ సర్పంచ్సత్యాగౌడ్ కొద్ది రోజులుగా కామారెడ్డి టౌన్లోని రాజీవ్ నగర్లో ఉంటున్నాడు. సెల్పీ వీడియోతో పాటు, లెటర్లో వివరాల ప్రకారం.. సత్యాగౌడ్ ఊరిలో 15 నెలల కింద రూ.7.50 లక్షల సీసీ రోడ్డు పని చేశాడు.
ALSO READ :ఫుడ్ పాయిజన్.. 40 మంది స్టూడెంట్లకు అస్వస్థత
ఈ బిల్లు ఇంకా రాలేదు. సింగరాయిపల్లి ప్రస్తుత సర్పంచ్మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ ఈ ఏడాది మే 22న ఇంట్లో నుంచి బయటకెళ్లి, 23న శవమై కనిపించాడు. ఇతడి ఆత్మహత్యకు కారణమంటూ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేయగా, అందులో సత్యాగౌడ్ కూడా ఉన్నాడు. కొద్ది రోజుల కింద బెయిల్పై బయటకు వచ్చాడు. తనకు రావాల్సిన బిల్లు గురించి ఆఫీసర్లను సంప్రదించాడు. తనకు చెక్ఇవ్వలేదని, సీసీ రోడ్డు పని చేసేందుకు అప్పులపాలైనట్లు వీడియో లో పేర్కొన్నాడు. అధికం రాజేందర్గౌడ్, తోట భూమయ్య, ఇసాయిపేట సర్పంచి బాలాగౌడ్కలిసి ఎమ్మెల్యేకు చెప్పి, సర్పంచ్కొడుక్కి చెక్ఇప్పించారని అందులో చెప్పాడు. తన చావుకు భూమయ్య, రాజేందర్, బాలాగౌడ్, గొల్ల అంజయ్య కారకులని చెప్పాడు. ఎంపీవో, సెక్రెటరీ, డీఎల్పీవో వారికి సహకరించారని లెటర్లో రాశాడు.