- తెల్లారిన తర్వాత హాస్పిటల్స్కు తరలింపు
- పేరెంట్స్కు లేట్గా సమాచారం
- జిల్లా వైద్యాధికారులకూ చెప్పలే
హనుమకొండ/ కాజీపేట, వెలుగు: హనుమకొండ జిల్లా కాజీపేట మండలం భట్టుపల్లిలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ ప్రైమ్ క్యాంపస్ లో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ జరిగింది. డిన్నర్సమయంలో వెజ్,నాన్ వెజ్కర్రీస్తో తిన్న 40 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీని గురించి పేరెంట్స్ కు గాని, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు కానీ చెప్పలేదు. స్థానికులు, డాక్టర్ల కథనం ప్రకారం..భట్టుపల్లిలోని ఎస్ఆర్ ప్రైమ్ క్యాంపస్ లో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్ వసతితో కాలేజీ నిర్వహిస్తున్నారు. 2 వేల మంది వరకు స్టూడెంట్స్ ఉండగా.. ప్రతి ఆదివారం వెజ్, నాన్వెజ్తో భోజనం పెడతారు.
ఈ ఆదివారం రాత్రి గర్ల్స్ క్యాంపస్లో కొంతమంది చికెన్..మరికొందరు లడ్డూలు తిన్నారు. భోజనం తర్వాత కొంతమంది కండ్లు తిరగడం, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోలేదు. తెల్లవారిన తర్వాత సోమవారం ఉదయం దవాఖానకు తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురైన ఆరుగురికి క్యాంపస్లోనే ట్రీట్మెంట్ చేశారు. నలుగురిని హనుమకొండ చౌరస్తాలోని జయ హాస్పిటల్ కు, మరో 30 మందిని వరంగల్ హంటర్రోడ్డులోని ఫాదర్ కొలంబో మెడికేర్ హాస్పిటల్కు తరలించి ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేశారు. 12 మందిని ఇంటికి పంపించగా 18 మందికి ట్రీట్మెంట్ఇస్తున్నారు. పిల్లలెవరికీ ప్రాణాపాయం లేదని ఫాదర్ కొలంబో మెడికేర్దవాఖాన డైరెక్టర్ డా.చిన్నపరెడ్డి తెలిపారు.
ALSO READ :పొంగులేటి ఆక్రమణలో.. 21.5 గుంటల ఎన్ఎస్పీ ల్యాండ్
సోమవారమే చెప్పారు
పిల్లలను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఫాదర్ కొలంబో దవాఖానకు తరలివచ్చారు. దవాఖాన వర్గాలు హెల్త్ డిపార్ట్మెంట్కు చెప్పగా డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ఆఫీసర్ డా.వాణిశ్రీ వచ్చి స్టూడెంట్స్తో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదన్నది వాస్తవమేనన్నారు. క్యాంపస్ ను విజిట్ చేసినట్లు చెప్పారు. ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. కాలేజీలో కొంతమంది పిల్లలకు చికిత్స చేస్తున్నట్టు తెలుసుకున్న మీడియా అక్కడికి వెళ్లగా అనుమతించలేదు.