
- యూనిట్ల మంజూరుకు పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకున్నరు
- లబ్ధిదారులకు న్యాయం జరగలేదని సీఎంకు ఎఫ్జీజీ లేఖ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బం ధుపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎప్జీజీ) ప్రెసి డెంట్ పద్మనాభరెడ్డి కోరారు. ఈ అంశంపై శుక్రవారం సీఎంకు లేఖ రాశారు. స్కీమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి సమస్యల్లో చిక్కుకుందని, లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, యూని ట్ల మంజూరులో పెద్ద ఎత్తున కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. యూనిట్ కాస్ట్ రూ.10 లక్షలు అయితే, రూ.2 లక్షలు కమీషన్లే తీసుకున్నారని పద్మనాభరెడ్డి తెలిపారు.
ఎన్నికల్లో లబ్ధికోసమే ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు మాజీ సీఎం స్పష్టం చేశారని, అప్పుడు ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. ఈ స్కీముకు 2022–-23 ఏడాదిలో రూ 17,700 కోట్ల బడ్జెట్ కేటా యించారని, మొత్తుం స్కీమును ఐదేండ్లలో రూ. 1.7 లక్షల కోట్లతో అమలు చేయాలని నిర్ణయించారని తెలిపారు. రూ.3,884 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినా ఉపయోగంలోనికి రాలేదని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.