హైదరాబాద్: గౌడ వృత్తిదారుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అందులో భాగంగానే భారతదేశంలో అత్యంత అధునికరమైన నీరా కేఫ్ను హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో రూ.3 కోట్ల నిధులతో నిర్మించటానికి ఈ నెల 23న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం తన రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో శంకుస్థాపన ముందస్తు ఏర్పాట్లపై గౌడ సామాజిక ప్రతినిధులు, గౌడ సంఘాల నాయకులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో నీరా కేఫ్ ప్రతిపాదిత నమూనా ను మంత్రి పరిశీలించారు. అనంతరం హజరైన ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల నాయకులతో నమూనా కేఫ్ పై చర్చించారు.