గ్రాడ్యుయేట్స్ పోలింగ్ : 10 గంటల వరకు 11శాతం ఓటింగ్

గ్రాడ్యుయేట్స్ పోలింగ్ : 10 గంటల వరకు 11శాతం ఓటింగ్

నల్లగొండ- ఖమ్మం- వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటల వరకు  605 పోలింగ్ స్టేషన్లకు గాను 4 లక్షల 63 వేల 839 మంది ఓటర్లలో 52 వేల 592 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు11.34 శాతం  పోలింగ్ నమోదైంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే..

  •  సిద్దిపేట జిల్లాలో 5 పోలింగ్ స్టేషన్లకు గాను 4 వేల 679 మంది ఓటర్లలో 516 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 11.03 శాతం పోలింగ్ నమోదైంది.
  • జనగామ జిల్లాలో  27 పోలింగ్ స్టేషన్లకు గాను  23 వేల 416 మంది ఓటర్లలో  2 వేల 396 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 10.23  శాతం పోలింగ్ నమోదైంది.
  • హనుమకొండ జిల్లాలో 67 పోలింగ్ స్టేషన్లకు గాను 43వేల 729 మంది ఓటర్లలో  6 వేల 294 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 14.39 శాతం  పోలింగ్ నమోదైంది.
  •  వరంగల్ జిల్లాలో 59 పోలింగ్ స్టేషన్లకు గాను 43వేల 812 మంది ఓటర్లలో  5 వేల 756 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 13.14 శాతం  పోలింగ్ నమోదైంది.
  •  మహబూబాబాద్  జిల్లాలో 36 పోలింగ్ స్టేషన్లకు గాను 34వేల 933 మంది ఓటర్లలో  3 వేల 846 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 11.01 శాతం  పోలింగ్ నమోదైంది.
  •   ములుగు జిల్లాలో 17 పోలింగ్ స్టేషన్లకు గాను 10వేల 299 మంది ఓటర్లలో ఒక వెయ్యి 62 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 10.31 శాతం  పోలింగ్ నమోదైంది.
  •   భూపాలపల్లి  జిల్లాలో 16 పోలింగ్ స్టేషన్లకు గాను 12వేల 535 మంది ఓటర్లలో 989 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 7.89 శాతం  పోలింగ్ నమోదైంది.
  • భద్రాద్రి   జిల్లాలో 55 పోలింగ్ స్టేషన్లకు గాను 40వేల 106 మంది ఓటర్లలో 3 వేల 104 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 7.74 శాతం  పోలింగ్ నమోదైంది.
  • ఖమ్మం జిల్లాలో 118 పోలింగ్ స్టేషన్లకు గాను 83వేల 879 మంది ఓటర్లలో 10 వేల 914 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 13.01 శాతం  పోలింగ్ నమోదైంది.
  • యాదాద్రి భువనగిరి జిల్లాలో 37 పోలింగ్ స్టేషన్లకు గాను 34వేల 080 మంది ఓటర్లలో 3 వేల838 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 11.26 శాతం  పోలింగ్ నమోదైంది.
  • సూర్యాపేట  జిల్లాలో 71 పోలింగ్ స్టేషన్లకు గాను 51వేల 497 మంది ఓటర్లలో 5 వేల828 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 11.32 శాతం  పోలింగ్ నమోదైంది.
  • నల్లగొండ జిల్లాలో 97 పోలింగ్ స్టేషన్లకు గాను 80వేల 871 మంది ఓటర్లలో 8 వేల49 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటల వరకు 9.95 శాతం  పోలింగ్ నమోదైంది.