కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్రెసిడెన్సియల్స్కూల్కు శుక్రవారం లింగంపేట మండలం మోతే శివారులో శంకుస్థాపన చేశారు. జహీరాబాద్ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ఆశిష్సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర తదితరులు పాల్గొని శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోందన్నారు.
