ఆర్మూర్, వెలుగు: నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తానని ఆర్మూర్ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. గురువారం ఆలూరులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 40 మంది లబ్ధిదారులకు పంపిణి చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. గుత్ప నుంచి ఆలూర్కు, కల్లెడ నుంచి ఆలూర్ కు, ఆలూరు నుంచి గుత్పకు డబుల్ లైన్ రోడ్లు మంజూరు చేయించానని చెప్పారు. ఆలూర్ గ్రామానికి బైపాస్ రోడ్డు అవసరమని, ఏకాభిప్రాయంతో ముందుకు వస్తే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచులు విజయ్, సుస్మిత, నర్సయ్య, హరీశ్, మల్లయ్య, యాదగిరి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
