- నలుగురిని రిమాండ్కు పంపిన పోలీసులు
ఓల్డ్సిటీ వెలుగు: పాతబస్తీతో ఓ ఇంట్లోకి చొరబడి కత్తులతో బెదిరించి రూ.40 లక్షలు టాటీ చేసిన కేసులో నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మీర్చౌక్ ఏసీపీ కార్యాలమయంలో ఏసీపీ జి.శ్యాం సుందర్ వివరాలు వెల్లడించారు. భవాని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమన్ నగర్ బీలో నవంబర్ 30న మహమ్మద్ సుల్తాన్ ఇంట్లోకి గుర్తుతెలియని దొంగలు చొరబడ్డారు.
ఆయనను కత్తులతో బెదిరించి రూ.40 లక్షలతో పాటు బైక్ను ఎత్తుకెళ్లారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు భవానినగర్ తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇర్పాన్, ముదస్సిర్ అలాహి(19), మొహమ్మద్ జాహిద్(37), మైలార్దేవ్పల్లికి చెందిన బిహార్వాసి అబ్దుల్ రెహమాన్(25)ను నిందితులుగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి రూ.34 లక్షల 66 వేలు రికవరీ చేశారు.
కత్తి, ఐదు బైక్లు, ఐదు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల్లో నిందితులు రూ.5 లక్షల 44 వేలు జల్సాలకు ఖర్చు చేశారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ చాటిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, భవాని నగర్, రెయిన్బజార్, మీర్చౌక్ పోలీసులు బృందాన్ని ఏసీపీ శ్యాంసుందర్ అభినందించారు. సమావేశంలో భవానినగర్ సీఐ బాలస్వామి, మీర్చౌక్ సీఐ సురేష్ కుమార్ పాల్గొన్నారు.
