ఇబ్రహీంపట్నం, వెలుగు: చెడు వ్యసనాలకు బానిసలై గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లడంతోపాటు ఇండ్లల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు ఆటో డ్రైవర్లను ఆదిబట్ల పోలీసులు సోమవారం అరెస్ట్చేశారు. మరో డ్రైవర్పరారీలో ఉన్నాడు. ఇన్స్పెక్టర్టి.రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలాపూర్పీఎస్పరిధిలోని షాహిన్నగర్కు చెందిన షేక్ఇక్బాల్, జాఫర్, సయ్యద్అహ్మద్, మహమ్మద్గౌస్, పాత బస్తీకి చెందిన షేక్అమీర్మద్యానికి బానిసలై, ఈజీ మనీ కోసం చోరీలకు ప్లాన్చేశారు.
మొదట పార్క్ చేసిన వెహికల్స్నుంచి డీజిల్, ఇండ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. బాచుపల్లి పీఎస్పరిధిలో 3, చాంద్రాయణగుట్టలో ఒకటి, చార్మినార్ లో 2, హయత్ నగర్లో 5, ఇబ్రహీంపట్నంలో 3, కందుకూరులో ఒకటి, మంచాలలో 2, పహాడీషరీఫ్లో 4, యాచారం, మైలార్దేవ్ పల్లి, వనస్థలిపురం పీఎస్ల పరిధిలో ఒక్కో చోరీ చేసి జైలుకెళ్లారు. రిలీజ్అయ్యాక ఆటో డ్రైవర్లుగా మారారు. సంపాదన సరిపోక తిరిగి చోరీలు మొదలుపెట్టారు. ఉప్పల్ సమీపంలోని చిలుకానగర్లో ఓ కారును దొంగిలించారు.
తర్వాత అబ్దుల్లాపూర్ మెట్, ఆదిబట్ల, పహాడీషరీఫ్ పీఎస్ల పరిధిలో గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లారు. ఆదిబట్ల పీఎస్పరిధిలోని వండర్లా సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇక్బాల్, జాఫర్, అహ్మద్, మహమ్మద్ గౌస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా గొర్రెలు, మేకల చోరీ విషయం బయటపడింది. వారి నుంచి రూ.2 లక్షల50వేలు క్యాష్, రూ.4లక్షల50వేలు విలువ చేసే 48 గొర్రెలు, మేకలతో పాటు ఇండికా కారు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. షేక్ అమీర్ పరారీలో ఉన్నాడు.