రేవంత్​ను వెన్నుపోటు పొడిచేందుకు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుట్ర : కేఏ పాల్

రేవంత్​ను వెన్నుపోటు పొడిచేందుకు..  కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుట్ర :  కేఏ పాల్

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్  రెడ్డిని వెన్నుపోటు పొడవాలని నలుగురు కాంగ్రెస్  ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్  ఆరోపించారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల పేర్లు తనకు తెలుసని, వారి పేర్లు రాహుల్ గాంధీకి చెప్పానన్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలకు గుండు గీసి పైకి పంపిస్తా అని హెచ్చరించారు.

బుధవారం అమీర్​పేటలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో పాల్  మాట్లాడారు. శుక్రవారం నుంచి గ్లోబల్ పీస్ సమ్మిట్ నిర్వహిస్తున్నానని, దీనికి సీఎం రేవంత్ హాజరవుతున్నారని తెలిపారు. ఇక నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్  ఎలా ఇస్తారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. సోనూ సూద్​కు పద్మవిభూషణ్​ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.