నేష నల్ సైన్స్ ఫెయిర్ కు  జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టు లు : డీఎస్ఓ రాజిరెడ్డి  

నేష నల్ సైన్స్ ఫెయిర్ కు  జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్టు లు : డీఎస్ఓ రాజిరెడ్డి  

మెదక్​, వెలుగు: నేషనల్   సైన్స్​ ఫెయిర్​ కు మెదక్​ జిల్లా నుంచి నాలుగు ప్రాజెక్ట్​ లు ఎంపికైనట్టు డీఈఓ విజయ, డీఎస్​ఓ రాజిరెడ్డి  తెలిపారు. జనవరి 7  నుంచి 9 వరకు మూడు రోజులపాటు కామారెడ్డిలో నిర్వహించిన స్టేల్​ టవల్​ సైన్స్​ ఫెయిర్​లో  వివిధ జిల్లాల నుంచి వచ్చిన  21 ప్రాజెక్ట్​ లను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ  ఎవల్యూషన్ కమిటీ..  నేషనల్​ లెవల్​ సైన్స్​ ఫెయిర్ కు ఎంపిక చేసినట్టు వివరించారు. అందులో మెదక్​ జిల్లా నుంచి  నాలుగు ప్రాజెక్ట్​ లు ఉన్నట్టు తెలిపారు.

తూప్రాన్​ గీతా హైస్కూల్​ స్టూడెంట్​  బి.మహతి రూపొందించిన 'వ్యర్థాల నిర్వహణ,  ప్లాస్టిక్ లకు ప్రత్యామ్నాయం' అనే ఎగ్జిబిట్​, మెదక్​ మండలం మాచవరం సిద్ధార్థ రూరల్ హై స్కూల్ స్టూడెంట్​ అక్షయ్​ రూపొందించిన  'ఎమర్జింగ్ టెక్నాలజీ'  అనే ఎగ్జిబిట్​, పాపన్నపేట మండలం చీకోడ్​ లింగాయిపల్లి హైస్కూల్​ స్టూడెంట్​  గణేష్  రూపొందించిన ' నీటి సంరక్షణ, నిర్వహణ' ఎగ్జిబిట్​, మెదక్​ సరస్వతీ కాన్వెంట్​ హైస్కూల్​ స్టూడెంట్​  ఆసీఫా రూపొందించిన 'వినోద భరిత గణితం' ఎగ్జిబిట్​ నేషనల్​ లెవల్​ సైన్స్​ ఫెయిర్​ కు ఎంపికయ్యాయని వెల్లడించారు.

ఆయా విద్యార్థులను, గైడ్ టీచర్ లను కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్​ కలెక్టర్ నగేష్  అభినందించారు. ఇదే  స్పూర్తి తో జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో రాణించి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు.