పెట్టుబ‌డి పెడితే లాభాల్లో వాటా ఇస్తామ‌ని రూ.10 కోట్ల మోసం

పెట్టుబ‌డి పెడితే లాభాల్లో వాటా ఇస్తామ‌ని రూ.10 కోట్ల మోసం

హైద‌రాబాద్: త‌మ వ్యాపారంలో పెట్టుబడి పెడితే…వచ్చిన లాభంలో కమిషన్ ఇస్తామని చుట్టూ ప‌క్క‌న వారిని న‌మ్మించారు. ఆ అమాయ‌కులు నుంచి రూ.10 కోట్ల వర‌కూ వ‌సూలు చేశారు. స‌రైన స‌మ‌యం చూసి గ‌త సెప్టెంబ‌ర్ లో ఊరెళ్లి మ‌ళ్లీ తిరిగి రాలేదు. పెట్టుబ‌డి పెట్టిన వారు త‌మ డ‌బ్బులు తిరిగివ్వాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

న‌గరంలోని సనత్ నగర్ డివిజన్ బాలయ్య నగర్ లో జ‌రిగిందీ మోసం. స్థానిక‌ బాలాజీ అపార్ట్మెంట్ లో నివసించే గంట గాంధీ, రమాదేవి దంపతులు,గంట సంతోష్ మంగమ్మ దంపతులు ఈ మోసాని పాల్ప‌డ్డార‌ని తెలిసింది. ఈ న‌లుగురూ త‌మ‌ చుట్టూ పక్కల నివసించే నాగ జ్యోతి,భవాని,మన్మధరావు, పూర్ణిమా, హేమలత,నాగమణి ఇలా పలువురి దగ్గర వ్యాపారంలో పెట్టుబడి పెడితే కమిషన్ ఇస్తామని నమ్మబలికారు. దీంతో వారంతా తమ నగలు నట్రా తాకట్టు పెట్టి 10 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే గత సెప్టెంబర్ లో తమ బంధువు చనిపోయాడని చెప్పి ఊరెళ్లిన వారు మళ్ళీ తిరిగి రాలేదు. అనుమానం వ‌చ్చిన‌ బాధితులు తమ డబ్బు చెల్లించాలని అడిగితే బెదిరింపులకు పాల్పడడంతో సనత్ నగర్ పీఎస్ తో పాటు పలు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు. ఈ స్కాం పై పోలీసులు చొరవ తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.