దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ ఇప్పటికే ఏపీ,చండీగర్, కర్ణాటకలో ఒక్కో కేసు నమోదుకాగా..లేటెస్ట్ గా నాగ్ పూర్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయ్యింది. మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ(40)కు పాజిటివ్ వచ్చింది. అతను ఇటీవల సౌతాఫ్రికా నుంచి ఢిల్లీ మీదుగా నాగ్ పూర్ కు వచ్చాడు. డిసెంబర్ 6న శాంపిల్స్ టెస్టుకు పంపించగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 37 కు చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే 18 ఒమిక్రాన్ కేసులున్నాయి.
Nagpur reports its first case of #Omicron in a 40-year-old man: Municipal Commissioner Radhakrishnan B
— ANI (@ANI) December 12, 2021