
ముషీరాబాద్, వెలుగు: తమకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక హెచ్చరించింది. మేనిఫెస్టో హామీలను నెరవేర్చాలని, లేదంటే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని వెల్లడించింది. శనివారం బాగ్ లింగంపల్లిలో జరిగిన సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్, 1969 ఉద్యమకారులు గొల్లపల్లి దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల సంక్షేమ బోర్డు, గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు పాసులు, 250 గజాల ఇంటి స్థలం, రూ.30 వేల గౌరవ వేతనం, రూ.20 లక్షల ఆరోగ్య బీమా, అమరుల కుటుంబాలకు సంక్షేమ నిధి, స్మారక భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.