
న్యూఢిల్లీ: జీ20 దేశాలు 2023 నాటికి ప్రపంచ రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం మూడింతలు, ఆ ఎనర్జీ వినియోగ సామర్థ్యం రెండితలకు పెంచుకునేలా లక్ష్యాలు పెట్టుకోవాలని యూరోపియన్ కమిషన్ కోరింది. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమిట్లో భాగంగా శనివారం నిర్వహించిన ‘వన్ ఎర్త్’ సెషన్లో యురోపియన్ కమిషన్ప్రెసిడెంట్ ఉర్సులా వాన్డెల్లేయెర్ క్లైమెంట్చేంజ్ ప్రభావం, పరిష్కార మార్గాలపై మాట్లాడారు.
‘క్లైమెట్ చేంజ్ పూర్తిగా మానవ సృష్టి. కనుక మనమే సరి చేయగలం. 4% కంటే తక్కువ ఉద్గారాలను వెలువరిస్తున్న ఆఫ్రికా దేశాలు వీటి ప్రభావానికి ఎక్కువ గురువుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలనే లక్ష్యం చాలా కష్టమైనదే. అయితే దీన్ని మనం సాధించగలం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2030 వరకు ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీని మూడింతలు పెంచాలి. వినియోగాన్ని రెట్టింపు చేయాలి. దీంతో టెంపరేచర్ పెరుగుదల 1.5 డిగ్రీలకు పరిమితమవుతుంది’’ అని ఆమె చెప్పారు.