నిధులు ఇప్పిస్తం..కరెక్ట్ ఖర్చు పెట్టాలె : గడ్డం ప్రసాద్ కుమార్ 

నిధులు ఇప్పిస్తం..కరెక్ట్ ఖర్చు పెట్టాలె : గడ్డం ప్రసాద్ కుమార్ 
  • అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ ​కుమార్ 

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్ లోని గౌళీకార్​నర్సింగ్ ఫంక్షన్ హాల్లో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లకు జిల్లా స్థాయి శిక్షణ, సన్నాహక సమావేశం నిర్వహించారు.

దీనికి హాజరైన అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ జిల్లా నుంచి ముఖ్యమంత్రితో పాటు తను ఉన్నత స్థానాల్లో ఉన్నామని, అవసరమైన నిధులు మంజూరు చేయించే బాధ్యత తమదన్నారు. వాటిని సమర్ధవంతంగా ఖర్చు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులదన్నారు. కలెక్టర్ దీపక్ తివారి, తాండూర్​ ఎమ్మెల్యే మనోహర్​రెడ్డి, ఎస్పీ స్నేహామెహ్రా, అడిషనల్​కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.