ఏప్రిల్ 19న గడ్డం వంశీకృష్ణ ఫస్ట్ నామినేషన్ సెట్

ఏప్రిల్ 19న గడ్డం వంశీకృష్ణ ఫస్ట్ నామినేషన్ సెట్

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం మరో 24 గంటల్లో మొదలుకానుంది. దీంతో లోక్ సభ బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు మంచి ముహూర్తాలు చూసుకుంటున్నారు. మంచి రోజు, శకునం చూసుకుని నామినేషన్ వేయాలని భావిస్తున్నారు.

ఉన్న ముహూర్తాల్లో 19వ తేదీయే చాలా బాగుందని పండితులు చెప్తుండడంతో రాష్ట్రంలో చాలా మంది అభ్యర్థులు తమ ఫస్ట్ నామినేషన్ సెట్ ను ఆ రోజు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ తర్వాత మరో రోజు ర్యాలీ నిర్వహించి మరో సెట్ నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కూడా ఈ నెల19న ఫస్ట్ సెట్ నామినేషన్ వేయనున్నారు. అలాగే 23 లేదా 24వ తేదీన ర్యాలీగా వెళ్లి మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా ఈ నెల19న ఒక సెట్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. చివరి రోజు 25న ర్యాలీగా వెళ్లి మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సైతం ఈ నెల19న లేదా 20న నామినేషన్ వేయనున్నట్లు తెలిసింది.