
ఆదిలాబాద్/మంచిర్యాల/నేరడిగొండ/కోల్బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన గడ్డం వివేక్ వెంకటస్వామికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ సేవాదళ్ స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నీలకంఠేశ్వరరావు మంత్రి వివేక్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వివేక్ ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ఆడె గజేందర్ హైదరాబాద్ లోని సచివాలయంలో మంత్రిని కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ఆదిలాబాద్అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి మంత్రి వివేక్కు విషెస్ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, అనుబంధ సంఘాల లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలివెళ్లి మంత్రి వివేక్ వెంకటస్వామిని శాలువాలతో సన్మానించారు.