
హైదరాబాద్ లోని హైటెక్స్ లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి సినీ ,రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి , సినిమాటోగ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజ్ , ఎఫ్ డీసీ ఎండీ హరీశ్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డులు ఇవ్వగా 2014 నుంచి ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ 10 ఏండ్ల తర్వాత ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోంది.
2014 నుంచి 2024 వరకు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన సినిమాలకు, నటులు, దర్శకులు, టెక్నిషియన్లకు ప్రభుత్వం అవార్డులను ఇస్తోంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ నటీనటులకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.