గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. దయానంద్ దర్శకుడు. రవి కస్తూరి నిర్మాత. మధుబాల, ఆదిత్య మీనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2న రిలీజ్ చేయనున్నట్టు గురువారం ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘రథం’ తర్వాత గీతానంద్ని మరోస్థాయిలో నిలబెట్టే చిత్రమిది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
రెండు పాటలు, టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మధుబాల క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అవుతుంది. న్యూఏజ్ కథతో రూపొందిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది’ అన్నారు. ఇంటెన్స్ క్యారెక్టర్స్ మధ్య జరిగే ఎమోషనల్ జర్నీయే ఈ సినిమా అని, ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని దర్శకుడు దయానంద్ చెప్పాడు.