పద్మారావునగర్, వెలుగు: ఇనుప మేకులు మింగి చర్లపల్లి జైలులోని ఓ ఖైదీ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గాంధీ ఆస్పత్రి డాక్టర్లు ఎండోస్కోపీ చేసి తొమ్మిది మేకులను బయటకు తీసి ఖైదీని కాపాడారు. ఇటీవల రిమాండ్ ఖైదీగా జైలుకు వచ్చిన మహ్మద్ షేక్ (32) తీవ్రమైన కడుపునొప్పితో ఇబ్బంది పడుతుండడంతో పోలీసులు నాలుగు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డులో చేర్చారు.
ఎక్స్రే తీసిన డాక్టర్లు ఖైదీ కడుపులో తొమ్మిది ఇనుప మేకులున్నట్లు గుర్తించారు. గాంధీ గ్యాస్ట్రోఎంట్రాలజీ హెచ్వోడీ ప్రొఫెసర్ శ్రవణ్కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఎండోస్కోపీ చేసి తొమ్మిది మేకులను బయటకు తీశారు. ఈ కేసును చాలెంజ్గా తీసుకుని ట్రీట్మెంట్చేశామని, ఎండోస్కోపీ టైమ్లో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఖైదీ ప్రాణాలు పోయేవని డాక్టర్లు తెలిపారు.