ఆరోగ్యశ్రీతో మూడేండ్ల చిన్నారికి ఫ్రీగా ఆపరేషన్

ఆరోగ్యశ్రీతో మూడేండ్ల చిన్నారికి ఫ్రీగా ఆపరేషన్

ఆరోగ్యశ్రీతో మూడేండ్ల చిన్నారికి ఫ్రీగా ఆపరేషన్
డాక్టర్లను అభినందించిన మంత్రి హరీశ్ రావు

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్ లో మరో అరుదైన ఆపరేషన్‌‌ను డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. సోమవారం హాస్పిటల్ ఆవరణలో సూపరింటెండెంట్ రాజారావు మాట్లాడుతూ..సిద్దిపేట జిల్లా వర్గల్​మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన నవీన్ కూతురు మూడేండ్ల రుత్వికకు వినికిడి సమస్య ఉండగా గాంధీ హాస్పిటల్ లో కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించామన్నారు.

ఈఎన్‌‌టీ డిపార్ట్‌‌మెంట్ కు చెందిన డాక్టర్ల టీమ్ మొదటిసారిగా ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్​ట్రస్ట్​స్కీమ్ తోఈ సర్జరీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈఎన్టీ డాక్టర్ల టీమ్ ఫ్రొఫెసర్​ఎ. శోభన్​బాబు, అసిస్టెంట్​ప్రొఫెసర్లు రతన్​కుమారి, విజయ్​కుమార్, అనస్తీషియా ప్రొఫెసర్​ మురళీధర్, అసిస్టెంట్ ఫ్రొపెసర్ గౌతమి, ఆడియోలాజిస్ట్​సాయికిరణ్‌‌ సర్జరీ చేసిన వారిలో ఉన్నారన్నారు. విజయవంతంగా సర్జరీ చేసిన డాక్టర్ల టీమ్ ను మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ లో అభినందించారు.