ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

విచ్చలవిడిగా నిషేదిత ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామన్నారు మాదాపూర్ డీసీపీ సందీప్ రావు. నిందితుల నుంచి రూ. 2 లక్షల విలువ చేసే 99 డిప్పోసల్ ఈ సిగరెట్లు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులను, పబ్ లను టార్గెట్ గా చేసుకుని నిషేదిత సిగరేట్లను ముఠా సభ్యులు అమ్ముతున్నారని పేర్కొన్నారు.ఈ సిగరెట్ విక్రయిస్తున్న పది మంది నిందితులను గుర్తించామని డీసీపీ వెల్లడించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. వారికోసం గాలిస్తున్నామన్నారు.

2019 లో ప్రభుత్వం ఈ సిగరెట్లు బ్యాన్ చెయ్యడం జరిగిందని డీసీపీ సందీప్ రావు అన్నారు. కాబట్టి ఈ సిగరెట్లు విక్రయించినా, కొనుగోలు చేసిన చట్టపరమైన చర్యలు తప్పవని డీసీపీ తెలిపారు.  

ALSO READ :హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి