హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి

హోటల్ లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి

హైదరాబాద్ బాలానగర్ లోని ఓ హోటల్ లో భారీ పేలుడు సంభవించింది. రంగారెడ్డి నగర్ లోని శ్రీసాయి హోటల్ లో గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడ వంట చేస్తున్న హోటల్ యజమాని సురేష్(42) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి వంట గది పూర్తిగా ధ్వంసం అయ్యింది. 

ALSO READ :ఈ సిగరెట్లు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్ 

గ్యాస్ సిలిండర్ పేలుడు శబ్ధానికి కస్టమర్లు, హోటల్ సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. సిలిండర్ పేలుడుకి హోటల్ భవనం లోపల భారీగా నిప్పు అంటుకుంది. హోటల్ భవనం బయట దట్టమైన పొగలు వ్యాపించాయి.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.