షాద్ నగర్, వెలుగు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. షాద్ నగర్ ఏసీపీ కుశలాకర్ వివరాలు వెల్లడిం చారు. చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి అలియాస్ రాజు(37), కొడంగల్ మండలంలోని పోచమ్మ గుట్ట తండాకు చెందిన జర్పుల మోతిరాం(35), వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని రమద్దుల గ్రామానికి చెందిన గొల్లకుంట్ల చందు(36) పరిగిలోని ఓ రూమ్ లో ఉంటూ కూలి పని చేసుకుంటూ ఆపై చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 18న షాద్ నగర్ పట్టణం విజయ నగర్ కాలనీలోని వారణాసి జగన్ అనే వ్యక్తి ఇల్లు తాళం వేసి ఉండగా.. తాళం పగులగొట్టి ఆ ఇంట్లోకి చొరబడి బీరువాలోని 20 తులాల బంగారం,13 తులాల వెండి దొంగిలించారు. జగన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ పోలీసులు శంషాబాద్ సీసీఎస్ పోలీసుల సహాయంతో చోరీకి పాల్పడ్డ ఈ ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. రాఘవేందర్ రెడ్డిపై ఇప్పటికే పలు స్టేషన్లలో 15 కేసులున్నట్లు గుర్తించారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- హైదరాబాద్
- May 13, 2023
లేటెస్ట్
- గ్లోబల్ వార్మింగ్ : సముద్రం ఇళ్లల్లోకి వచ్చేసింది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణలో కాంగ్రెస్ హవా.. 14 ఎంపీ సీట్లు గెలుస్తం : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- వీడియో: తల్లిదండ్రులూ జాగ్రత్త!.. అక్కడ బాల్ తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి
- ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం
- Yashwant Reddy, Shobha Shetty Engagement: ఘనంగా జరిగిన శోభా శెట్టి, యశ్వంత్ రెడ్డిల నిశ్చితార్థం
- పోతురాజు దినేష్ ఇక లేరు
- Thalaimai Seyalagam Official OTT: ఓటీటీలోకి శ్రీయారెడ్డి పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్..తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
- బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చిన్రు : గడ్డం వంశీకృష్ణ
- అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి పై ఈసీ వేటు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- వామ్మో.. ఇంత తక్కువా!.. రెయిన్ బో ఎలక్ట్రిక్ కారు రూ. 3.6 లక్షలే..
- శ్రీరాముని భార్య సీతాదేవి ఎప్పుడు పుట్టారో తెలుసా
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు