షాద్ నగర్, వెలుగు: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను షాద్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. షాద్ నగర్ ఏసీపీ కుశలాకర్ వివరాలు వెల్లడిం చారు. చేవెళ్ల మండలంలోని దేవుని ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి అలియాస్ రాజు(37), కొడంగల్ మండలంలోని పోచమ్మ గుట్ట తండాకు చెందిన జర్పుల మోతిరాం(35), వనపర్తి జిల్లా పానగల్ మండలంలోని రమద్దుల గ్రామానికి చెందిన గొల్లకుంట్ల చందు(36) పరిగిలోని ఓ రూమ్ లో ఉంటూ కూలి పని చేసుకుంటూ ఆపై చోరీలకు పాల్పడుతున్నారు. గత నెల 18న షాద్ నగర్ పట్టణం విజయ నగర్ కాలనీలోని వారణాసి జగన్ అనే వ్యక్తి ఇల్లు తాళం వేసి ఉండగా.. తాళం పగులగొట్టి ఆ ఇంట్లోకి చొరబడి బీరువాలోని 20 తులాల బంగారం,13 తులాల వెండి దొంగిలించారు. జగన్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న షాద్ నగర్ పోలీసులు శంషాబాద్ సీసీఎస్ పోలీసుల సహాయంతో చోరీకి పాల్పడ్డ ఈ ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. రాఘవేందర్ రెడ్డిపై ఇప్పటికే పలు స్టేషన్లలో 15 కేసులున్నట్లు గుర్తించారు.
వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
- హైదరాబాద్
- May 13, 2023
మరిన్ని వార్తలు
-
ఈరోజే లాస్ట్: ఎల్పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!
-
జ్యోతిష్యం.. ఒకే రాశిలోకి బుధుడు.. కుజుడు.. లాభ-దృష్టి రాజయోగంతో 4 రాశుల వారికి డబ్బు వర్షం..!
-
KGFకి ముందే నా కొడుకు సూపర్స్టార్... అల్లు అరవింద్ కామెంట్స్పై యశ్ తల్లి తీవ్ర ఆగ్రహం!
-
సెప్టెంబర్ 2026 : పండుగలు.. విశేషమైన రోజులు.. ప్రత్యేకతలు ఇవే..!
లేటెస్ట్
- ఈరోజే లాస్ట్: ఎల్పీజీ వినియోగదారులకు హెచ్చరిక.. e-KYC చేస్కోండి!
- జ్యోతిష్యం.. ఒకే రాశిలోకి బుధుడు.. కుజుడు.. లాభ-దృష్టి రాజయోగంతో 4 రాశుల వారికి డబ్బు వర్షం..!
- KGFకి ముందే నా కొడుకు సూపర్స్టార్... అల్లు అరవింద్ కామెంట్స్పై యశ్ తల్లి తీవ్ర ఆగ్రహం!
- సెప్టెంబర్ 2026 : పండుగలు.. విశేషమైన రోజులు.. ప్రత్యేకతలు ఇవే..!
- తుక్కుగూడలో నర్సుపై అమానుష ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి..
- హైదరాబాద్లో దడ పుట్టిస్తున్న దొంగలు.. పీర్జాదిగూడ గ్రీన్ ల్యాండ్స్ కాలనీలో అర్ధరాత్రి హల్చల్
- ఢిల్లీలో ఘోరం: ప్లేస్కూల్లో మూడేళ్ల బాలుడిని కుర్చీకి కట్టేసి, చెవులు పగిలేలా కొట్టిన ఆయా
- వీళ్లు మాములోళ్లు కాదు : క్రెడిట్ కార్డు మోసాల కోసం ఏకంగా ఆఫీస్ ఓపెన్.. 100 మంది ఉద్యోగులు.. !
- అంతొద్దు సీఎం విజయ్.. ఆశకు హద్దు ఉండాలి: డీఎంకే, కాంగ్రెస్ ఎగతాళి
- ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచి అమలు
Most Read News
- డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా రఘు మాస్టర్.. నూతన కార్యవర్గం ఇదే!
- ఉప్పల్లో ట్రాఫిక్ జామ్.. మేడిపల్లి నుంచి రింగు రోడ్డు వరకు నిలిచిపోయిన వాహనాలు
- మామ ఆస్తి కొనేందుకు 6 వేల 500 కోట్లు అప్పు చేస్తున్న మేఘా కృష్ణారెడ్డి
- రూ.30 లక్షలు ఇస్తా ఇండియా వదిలి పొమ్మని తండ్రి ఆఫర్: డైలమాలో హైదరాబాద్ టెక్కీ
- బార్డర్ దాటిన మహిళ.. 25 కోట్ల రూపాయల బంగారం చూసి జవాన్లు షాక్
- కొత్త వారం గోల్డ్ రేట్లు క్రాష్.. తులం ఎన్ని వేలు తగ్గిపోయిందంటే?
- యూఎల్సీ భూముల రెగ్యులరైజ్!శాశ్వత హక్కులు కల్పించేందుకు సర్కారు యోచన
- తెలంగాణలో మరో మూడ్రోజులు ముసురు.. హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు..
- పీజీ, పీహెచ్డీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక.. వివరాలివే
- బీఅలర్ట్: తెలంగాణలో రాబోయే వారం రోజులు వర్షాలు.. సీజనల్ వ్యాధులపై ఆరోగ్యశాఖ వార్నింగ్
