పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబోలో పవర్ఫుల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే భారీ ప్రాజెక్ట్ వస్తోన్న విషయం తెలిసిందే. దీనికి ఇంకా టైటిల్ను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ ఒకటి ట్రెండ్ అవుతోంది. ‘ఓజీ కోసం ఓ రాణి కావాలి కదా’ అంటూ ముందు ట్వీట్ చేసిన మూవీ టీం క్యూరియాసిటీని పెంచింది. ఆ తర్వాత ప్రియాంక అరుల్ మోహన్కు వెల్కమ్ చెప్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. ఇప్పటికే ఈ విషయం లీకై ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘ఓజీ ఫ్యామిలీలో భాగం అయినందుకు థ్రిల్లింగ్గా ఉంది. త్వరలోనే ఓ పవర్పాక్డ్ ఎంటర్టైనర్ రానుంది’ అంటూ ట్వీట్ చేసింది.
కోలీవుడ్లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఉంది. ‘గ్యాంగ్లీడర్’తో ఎంట్రీ ఇచ్చి తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకుంది. తనదైన చలాకీతనంతో చక్కటి తెలుగులో మాట్లాడుతూ నెటిజన్ల మనసులు సైతం దోచేసింది. ఇక ఓజీలో ప్రియాంక రోల్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15 నుంచి ముంబై షెడ్యూల్ను ఓజీ టీం స్టార్ట్ చేసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ స్వరాలను అందించనున్నాడు.