‘ఓజీ' కోసం ఓ రాణి వచ్చేసింది

‘ఓజీ' కోసం ఓ రాణి వచ్చేసింది

పవన్​ కళ్యాణ్​, సుజీత్​ కాంబోలో పవర్ఫుల్​ ఒరిజినల్ గ్యాంగ్​స్టర్​ అనే భారీ ప్రాజెక్ట్​ వస్తోన్న విషయం తెలిసిందే. దీనికి ఇంకా టైటిల్​ను ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఈ సినిమా నుంచి లేటెస్ట్​ అప్డేట్​ ఒకటి ట్రెండ్​ అవుతోంది. ‘ఓజీ కోసం ఓ రాణి కావాలి కదా’ అంటూ ముందు ట్వీట్ చేసిన మూవీ టీం క్యూరియాసిటీని పెంచింది. ఆ తర్వాత ప్రియాంక అరుల్​ మోహన్​కు వెల్కమ్ చెప్తూ అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ చేసింది. ఇప్పటికే ఈ విషయం లీకై ఈ ముద్దుగుమ్మ పేరు టాలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది. దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ‘ఓజీ ఫ్యామిలీలో భాగం అయినందుకు థ్రిల్లింగ్​గా ఉంది. త్వరలోనే ఓ పవర్​పాక్డ్​ ఎంటర్టైనర్​ రానుంది’ అంటూ ట్వీట్ చేసింది.

కోలీవుడ్​లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్​ ఉంది. ‘గ్యాంగ్​లీడర్​’తో ఎంట్రీ ఇచ్చి తెలుగులోనూ పాపులారిటీ తెచ్చుకుంది. తనదైన చలాకీతనంతో చక్కటి తెలుగులో మాట్లాడుతూ నెటిజన్ల మనసులు సైతం దోచేసింది. ఇక ఓజీలో ప్రియాంక రోల్​ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15 నుంచి ముంబై షెడ్యూల్​ను ఓజీ టీం స్టార్ట్​ చేసింది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్​ స్వరాలను అందించనున్నాడు.