
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో చెత్త సేకరణ నిలిచిపోయింది. స్వచ్ఛభారత్ చెత్త సేకరణ ట్రాలీ ఆటో రిపేర్కు వచ్చింది. మరమ్మతులు చేయించకపోవడంతో మూలకుపెట్టేశారు. ఉన్న ఒక్క ట్రాక్టర్ తో ప్రధాన రోడ్లపై చెత్త సేకరణ జరుగుతోంది.
వర్షాలు ప్రారంభం కావడంతో వీధుల్లోనే చెత్త మురిగిపోయి దుర్వాసన వస్తోంది. అధికారులు స్పందించి చెత్త సేకరణ ఆటోకు మరమ్మతులు చేయించి, నిత్యం చెత్త సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - ధర్మసాగర్, వెలుగు