వెల్లుల్లిని దంచి.. పాలలో మరిగించి

వెల్లుల్లిని దంచి.. పాలలో మరిగించి

వెల్లుల్లిని చాలామంది కూరల్లోకి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే.. అనేక రకాల ఆరోగ్య సమస్యలకు వెల్లుల్లి మంచి ఔషదంగా పనిచేస్తుంది.
వెల్లుల్లిని దంచి పాలల్లో వేసి మరిగించి ఆ పాలు తాగితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. పాలలో వెల్లుల్లి వేసి ఆ పాలు బాలింతకు తాగిస్తే.. పాలు ఒక్కు పాలు ఎక్కు వగా వస్తాయి. అధిక కొవ్వు సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని పాలలో మరిగించి తాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి మంచి మందు. దంచిన వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. మైగ్రేన్ కి వెల్లుల్లి సరైన ఔషధం.

మలబద్ధకంతో బాధపడేవారు మరుగుతున్న పాలలో వెల్లుల్లి వేసి ఆ పాలు తాగాలి. లేదంటే నీటిలో మరిగించి ఆ నీరు గోరువెచ్చగా అయిన
తర్వాత తాగినా ఫలితం ఉంటుంది.