గట్టు మైసమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలె

గట్టు మైసమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలె

ఘట్ కేసర్, వెలుగు : ఈ నెల 28న జరగనున్న గట్టు మైసమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఘట్ కేసర్ మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని అధికారులను ఆదేశించారు. జాతర నిర్వహణ, ఏర్పాట్లపై  మంగళవారం మున్సిపల్ ఆఫీసులో ఆమె అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ.. గట్టు మైసమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివస్తారని.. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్య రావొద్దన్నారు.  సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కమిషనర్ సాబేర్ అలీ,  సీఈవో భాగ్యలక్ష్మి, ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి, ఎస్సై శేఖర్  పాల్గొన్నారు.