నగలు కాదు.. కత్తులు కొనండి..!

నగలు కాదు.. కత్తులు కొనండి..!

యూపీ బీజేపీ నాయకుడి వివాదాస్పద కామెంట్స్

దేవ్​బంద్(యూపీ): బీజేపీ యూపీ నాయకుడు గజ్​రాజ్ రాణా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఏడాది ధన్ తేరాస్​కు బంగారు, వెండి నగలు కాదు.. ఇనుప కత్తులు కొనండి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేవ్​బంద్ సిటీ ప్రెసిడెంట్​గా ఉన్న గజ్​రాజ్.. ‘‘రామ మందిరానికి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుంది. అప్పు డుపరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు. హిందూ సమాజం కత్తులు కొనాలి.

రానున్న రోజుల్లో మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరం అవుతాయి’’అని అన్నారు. తాను ఏ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదన్నారు.  రాణా గతంలోనూ వివాదాస్పద కామెంట్స్‌‌ చేశారు. ‘‘ఒకప్పుడు మక్కా లోపల శివలింగం ఉండేది. అక్కడ హిందువులు నివసించేవారు”అని గతంలో వ్యాఖ్యానించారు.