యూపీ బీజేపీ నాయకుడి వివాదాస్పద కామెంట్స్
దేవ్బంద్(యూపీ): బీజేపీ యూపీ నాయకుడు గజ్రాజ్ రాణా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ ఏడాది ధన్ తేరాస్కు బంగారు, వెండి నగలు కాదు.. ఇనుప కత్తులు కొనండి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేవ్బంద్ సిటీ ప్రెసిడెంట్గా ఉన్న గజ్రాజ్.. ‘‘రామ మందిరానికి అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుంది. అప్పు డుపరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు. హిందూ సమాజం కత్తులు కొనాలి.
రానున్న రోజుల్లో మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరం అవుతాయి’’అని అన్నారు. తాను ఏ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదన్నారు. రాణా గతంలోనూ వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘‘ఒకప్పుడు మక్కా లోపల శివలింగం ఉండేది. అక్కడ హిందువులు నివసించేవారు”అని గతంలో వ్యాఖ్యానించారు.