హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు సీఎస్శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్కు చెందిన శ్రీనివాస్..2003 నుంచి టీఆర్ఎస్వీలో పనిచేస్తున్నారు.
2017లో టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఈటల రాజేందర్ను కేబినెట్నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయన టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్ సెగ్మెంట్కు 2021లో జరిగిన ఉప ఎన్నికలో శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.