టూరిజం కార్పొరేషన్ ​చైర్మన్​గా గెల్లు శ్రీనివాస్

టూరిజం కార్పొరేషన్ ​చైర్మన్​గా గెల్లు శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర​ టూరిజం డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్​గా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​ యాదవ్​ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు సీఎస్​శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్​జిల్లా వీణవంక మండలం హిమ్మత్​నగర్​కు చెందిన శ్రీనివాస్..​2003 నుంచి టీఆర్ఎస్వీలో పనిచేస్తున్నారు.

2017లో టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఈటల రాజేందర్​ను కేబినెట్​నుంచి బర్తరఫ్​ చేసిన తర్వాత ఆయన టీఆర్ఎస్​ను వీడి బీజేపీలో చేరారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజూరాబాద్​ సెగ్మెంట్​కు 2021లో జరిగిన ఉప ఎన్నికలో శ్రీనివాస్ టీఆర్ఎస్​ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.