ఘట్కేసర్లో కిడ్నాప్నకు గురయ్యాయని డ్రామా ఆడిన బీఫార్మసీ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అయితే కేసు మొత్తం డ్రామా అని తేలడంతో పోలీసులు యువతి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో యువతి షుగర్ ట్యాబ్లెట్లు మింగి ఆత్మహత్య చేసుకుంది. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కాలేజీ నుంచి వస్తున్న తనను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేశారంటూ యువతి పోలీసులకు తెలిపింది. అయితే పోలీసుల దర్యాప్తులో యువతి చెప్పిదంతా కట్టుకథ అని తేలింది.
For More News..