
లెజండరీ సంగీత దిగ్గజం, ప్రముఖ గజల్ గాయ కుడు, పద్మశ్రీ విజేత పంకజ్ ఉదాస్ కన్నుమూశా రు. ఆయన వయసు 72 ఏళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవా రం ఉదయం ముంబైలోని బీచ్ కాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కూతురు నయాబ్ ఉదాస్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియ జేశారు.
1951 మే 17న గుజరాత్లోని జెట్పూర్ లో పుట్టారు పంకజ్ ఉదాస్. ఆయన చిన్నతనం లోనే కుటుంబమంతా ముంబైకి షిప్ట్ అయింది. తన పెద్దన్నయ్య మన్హర్ ఉదాస్ హిందీ చిత్రాల్లో ప్లేబ్యాక్ సింగర్. మరో అన్న నిర్మల్ ఉదాస్ గజల్ గాయకుడు. డాక్టర్ అవ్వాలనే కోరిక ఉన్నప్పటికీ, అన్నల బాటలోనే పంకజ్ కూడా సింగర్ అయ్యా రు. 1970లో వచ్చిన ‘తుమ్ హసీన్ మే జవాన్’ చిత్రంలోని ‘మున్నీకి అమ్మా యేతో బతా’ పాటతో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో హిట్ సాంగ్స్ పాడారు. 1986లో వచ్చిన ‘నామ్’ చిత్రం లోని ‘చిట్టీ ఆయి హై’ పాట ఆయనకు అద్భుతమైన గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఏకే హీ మక్సద్ చిత్రంలో చాంది జైసా రంగ్ హై.. ‘దేవన్’ మూవీలో ‘ఆజ్ ఫిర్ తుంపే’, ‘ఘాయల్’లో మహియా తేరా కసమ్ లాంటి పాటలు పాపులర్. ఔర్ ఆహిస్తా కిజియే బాతే, తోడి తోడి పియా కరో లాంటి మరెన్నో చిరస్మరణీయమైన పాటలను ఆయన పాడారు. ఆహాత్ (1980) సహా చాలా గజల్స్ పాడారు పంకజ్. సొంతంగా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేశారు. ఆయన పాడిన ఎన్నో పాటలు క్లాసిక్స్గా నిలిచాయి. పంకజ్ సేవలకు గాను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవిం చింది. పంకజ్ ఉదాస్ మృతికి పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు.