హైదరాబాద్ లో 20 ప్రధాన చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనం

హైదరాబాద్ లో  20 ప్రధాన చెరువులు, 72 బేబీ పాండ్స్ లో నిమజ్జనం

హైదరాబాద్ సిటీ, వెలుగు : నగరంలో గణనాథుల సామూహిక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. హుస్సేన్​సాగర్​తో పాటు సిటీలోని 20 ప్రధాన చెరువులు, 72 బేబీ పాండ్స్​లో నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే నిమజ్జనాలు కొనసాగుతుండగా, శనివారం పూర్తి స్థాయిలో గణపయ్యలు గంగమ్మ ఒడికి చేరనున్నారు. ఆదివారం చంద్రగ్రహణం ఉన్న కారణంగా మండప నిర్వాహకులు శనివారం అర్ధరాత్రిలోపు నిమజ్జనాలు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ట్రాఫిక్, లా అండ్​ఆర్డర్ ​పోలీస్, జీహెచ్ఎంసీ, హెల్త్, వాటర్​బోర్డు, విద్యుత్, ఆర్టీసీ, మెట్రో ఇతర శాఖల అధికారులు కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. 

సొంత వాహనాలు వద్దు : ట్రాఫిక్​ సీపీ

సిటీలో ఎక్కడెక్కడ ట్రాఫిక్​ఆంక్షలు విధించారు?  డైవర్షన్స్​ ఎక్కడున్నాయి? పార్కింగ్ ​ప్లేసెస్​ లాంటి  వివరాలను శుక్రవారం ఎల్బీ స్టేడియం సమీపంలోని ట్రాఫిక్​ కాంప్లెక్స్​లో నిర్వహించిన సమావేశంలో ట్రాఫిక్​ సీపీ జోయల్​డేవిస్​ వివరించారు. ఖైరతాబాద్​ బడా గణేశ్​ శోభాయాత్ర ఉదయం 6 గంట లకు ప్రారంభమవుతుందని, నాలుగో నెంబర్ క్రేన్ వద్ద మధ్యాహ్నం 1:30 లోపు నిమజ్జనం పూర్తయ్యే  అవకాశం ఉందన్నారు. బడా గణేశ్​ శోభాయాత్ర జరుగుతున్నప్పుడు ఆ రూట్​లో వచ్చే ఇతర నిమజ్జన వాహనాలకు ఆపేస్తామ న్నారు. శనివారం ఉ..6 గంటల నుంచి ఆదివారం ఉ..10 గంటల వరకు ప్రధాన శోభాయాత్ర రూట్‌లో విగ్రహాలను తీసు కెళ్లే వాహనాలు తప్ప ఇతర వెహికల్స్​కు అనుమతి లేదన్నారు. శోభాయాత్ర చూడడానికి వచ్చే వారు సొంత వాహనాలకు బదులు బస్సులు లేదా రైళ్లను ఉపయోగించాలని కోరారు. 

10 లక్షల మంది వస్తరు 

నిమజ్జనోత్సవంలో 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ట్రాఫిక్ ​సీపీ చెప్పారు. చిన్న విగ్రహాలను తీసుకొచ్చే భక్తులు బేబీ పాండ్స్​లో నిమజ్జనం చేయాలని కోరారు. 4 రోజులుగా ప్రైవేట్ బస్సులను సిటీలోకి  అనుమతించడం లేదని, ఆర్టీసీ బస్సులకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయని చెప్పారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా రియల్ టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్స్​ అందిస్తామన్నారు.  బాలాపూర్​గణేశ్​21 కిలోమీటర్లు ప్రయాణించి హుస్సేన్​సాగర్​తీరంలో నిమజ్జనం అవుతాడని,  అడ్డంకులు కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. శనివారం హుస్సేన్​సాగర్​లో 20వేల విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని, టస్కర్​లో 10 వేలు,  ఇతర వాహనాల్లో మరో 10 వేలు వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే రూట్ ఇన్‌స్పెక్షన్‌ చేశామన్నారు. ఎయిర్​పోర్ట్ వెళ్లే వారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్‌ను మాత్రమే ఉపయోగించాలని కోరారు. 3200 మంది ట్రాఫిక్​ సిబ్బంది రెండు షిఫ్టుల్లో  డ్యూటీలు చేస్తారన్నారు. వాహనాల కదలికలు తెలుసుకోవడానికి  రెండు డ్రోన్‌లు,14 హై రైజ్డ్​ కెమెరాలను సిద్ధం చేసుకున్నామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్​ 
నుంచి విజువల్స్​ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సూచనలు చేస్తామన్నారు.