
- నాలుగు రోజుల్లో 221 మందిని గుర్తించిన బల్దియా
హైదరాబాద్ సిటీ, వెలుగు: బెగ్గర్ ఫ్రీ సిటీ కోసం జీహెచ్ఎంసీ మరోసారి యాక్షన్ప్లాన్తో రంగంలోకి దిగింది. నగరంలో ఎవరూ బిచ్చగాళ్లు ఉండొద్దనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టింది. ఈ నెల 23 నుంచి అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నగరంలో బెగ్గర్స్ను పట్టుకున్నారు.
మొత్తం 221 మందిని గుర్తించగా, ఇందులో 173 మంది పురుషులు, 37 మంది స్త్రీలు, 11 మంది పిల్లలున్నారు. వీరిలో 19 మందిని షెల్టర్ హోమ్ కు తరలించగా, మిగిలిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిటీలో ఎక్కడైనా బెగ్గర్స్ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ఆఫీసర్లు కోరుతున్నారు.