
గచ్చిబౌలి, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ఇలంబరితి, హెచ్ఎండీఏ కమిషనర్సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్సీపీ జోయస్ డేవిస్ మంగళవారం ఐటీ కారిడార్లో పర్యటించారు. ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి జంక్షన్, రాడిసన్ హోటల్జంక్షన్లలో చేపడుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు.
ఐఐఐటీ జంక్షన్ వద్ద హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించబోయే ఫ్లైఓవర్ పనులపై ప్రాజెక్ట్స్ సీఈ భాస్కర్ రెడ్డి, అధికారులతో సమీక్షించారు. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి బ్యూటిఫికేషన్పనులను వివరించారు. ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణానికి ఆస్తుల సేకరణ, ట్రాఫిక్ ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలన్నారు.