
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేబీఆర్ పార్కులోకి లైసెన్స్ తీసుకున్న పెట్డాగ్స్ ను మాత్రమే తీసుకురావాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. కేబీఆర్ పార్కులో చేపట్టిన వాకింగ్ట్రాక్, ఓపెన్జిమ్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే కేబీఆర్ చుట్టూ హెచ్ సిటీలో భాగంగా చేపట్టే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు కోర్టు ఆదేశాల మేరకు నిర్మిస్తున్నారా? అనే వివరాలను ప్రాజెక్టు ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కమిషనర్ సుభద్రాదేవి, డీసీ సమ్మయ్య, ప్రాజెక్టు ఈఈ మాన్యనాయక్, ఎస్ఈ శ్రీలక్ష్మి పాల్గొన్నారు.