విజేత సూపర్ మార్కెట్ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ కమీషనర్

విజేత సూపర్ మార్కెట్ను సీజ్ చేసిన  జీహెచ్ఎంసీ  కమీషనర్

రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్గూడలో విజేత సూపర్ మార్కెట్ను జీహెచ్ఎంసీ  కమీషనర్ రోనాల్డ్ రోస్ సీజ్ చేశారు.  రాజేంద్రనగర్లో అధికారులతో కలిసి సెప్టెంబర్ 26 మంగళవారం రోజున ఆయన పర్యటించారు ... ఈ క్రమంలో  తన ముందే చెత్తను రోడ్డుపై పడేశారు విజేత సూపర్ మార్కెట్ సిబ్బంది. దీంతో సీరియస్ అయిన   రోనాల్డ్ రోస్ .. వెంటనే  ఆ సూపర్ మార్కెట్ ను  సీజ్ చేసి రూ. 50 వేల రూపాయల జరిమానా విధించారు. 

ALSO READ : గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ లో  విజేత సూపర్ మార్కెట్ అంటే తెలియని వారంటూ ఉండరు.  సామన్యుల నుంచి ధనికులు వరకు అందులోకి వెళ్తుంటారు. సిటీలో మంచి బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఈ సూపర్ మార్కెట్ వార్తల్లోకి ఎక్కడం ఇదేం మొదటిసారి కాదు.  గతంలో  మదీనాగూడ, చందానగర్‌ ప్రాంతాల్లో ఉన్న విజేత సూపర్‌ మార్కెట్‌లో ఓకే సమయంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. అధికారుల సోదాల్లో నిర్వహకులు స్టోర్‌లో నాసీరకం పదార్ధాలను విక్రయిస్తున్నట్లు గుర్తించారు.