
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ మీట్–2025ను మంగళవారం విక్టోరియా ప్లే గ్రౌండ్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత, కమిషనర్ ఆర్వీ కర్ణన్, స్పోర్ట్స్ విభాగం అడిషనల్ కమిషనర్ యాదగిరిరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఆరు రోజుల పాటు ఈ స్పోర్ట్స్ మీట్ కొనసాగనుంది. మేయర్ మాట్లాడుతూ క్రీడలు ప్రతిభను వెలికి తీస్తాయని, ఉద్యోగులు కార్పొరేటర్లు, మీడియా ప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కాగా, బుధవారం ప్రింట్వర్సెస్ఎలక్రానిక్మీడియా జట్ల మధ్య క్రికెట్పోటీ జరగ్గా ఎలక్ట్రానిక్ మీడియా జట్టు విజయం సాధించింది. కార్పొరేటర్ల క్రికెట్ మ్యాచ్ లో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి టీం గెలిచింది.