భారతీనగర్​ డివిజన్​ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : జీహెచ్ఎంసీ జోనల్​ కమిషనర్​ హేమంత్

భారతీనగర్​ డివిజన్​ సమస్యలన్నీ పరిష్కరిస్తాం : జీహెచ్ఎంసీ జోనల్​ కమిషనర్​ హేమంత్

రామచంద్రాపురం, వెలుగు: భారతీనగర్​ డివిజన్​లోని సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని జోనల్​ కమిషనర్​ హేమంత్ హామీ ఇచ్చారు. శుక్రవారం డివిజన్​ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్​ సింధూ ఆదర్శ్​రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్ఐజీ మెయిన్​ రోడ్డు నుంచి మ్యాక్​ సొసైటీ కాలనీ వరకు కొత్త రోడ్డు, సొసైటీ కమ్యూనిటీ హాల్​ ఇతర పనులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

బీహెచ్ఈఎల్​ రోడ్డుకు ఇరువైపులా చెత్తా చెదారం పేరుకుపోయి ఉందని శానిటేషన్​ స్పెషల్ డ్రైవ్​లు కూడా ఫలితం లేనందున భెల్​ యాజమాన్యంతో మాట్లాడి చైన్​ లింక్​ మెష్​లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో ఇళ్లపై వేలాడుతున్న కరెంటు వైర్ల గురించి కార్పొరేటర్​ సింధు జోనల్​ కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లగా నూతన స్తంభాలను వేయించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

బీడీఎల్​, ఎంఐజీ కాలనీలలో ఓపెన్​ జిమ్​లు, బ్రాంచ్​ ఫ్రూనింగ్ వెహికల్స్​ కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తానని పేర్కొన్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్​ సురేశ్, ఎస్ఈ శంకర్, డీఈ దేవేందర్​, ఏఈ ఫైజల్, మెడికల్​ఆఫీసర్​ విజయ రామారావు, కాలనీ వెల్ఫేర్​ సభ్యులు పాల్గొన్నారు.