రామచంద్రాపురం, వెలుగు: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీహెచ్ఈఎల్ యాజమాన్యం సహకరించాలని, ఈ బెల్ భూముల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. రామచంద్రాపురం పరిధిలో పెండింగ్ సమస్యలపై భెల్ ఈడీ వై. శ్రీనివాస రావు, ఏజీఎం సురన్ప్రసాద్, అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు.
పలు సమస్యలపై చర్చిస్తూ ఈఎస్ఐ చర్చి సమీపంలో భెల్ పరిశ్రమ భూమిలో ఉందంటూ బీరప్ప గుడిని తొలగించారన్నారు. భెల్ ఏర్పడక ముందు నుంచి అక్కడ గుడి ఉందని అధికారులకు వివరించారు. రాయసముద్రం చెరువు సుందరీకరణకు బీహెచ్ఈఎల్ మేనేజ్మెంట్ అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.

